వారంతా పరారీలో ఉన్నారు : ఏసీపీ సూర్యచంద్రరావు

by  |
వారంతా పరారీలో ఉన్నారు : ఏసీపీ సూర్యచంద్రరావు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 4వరోజు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం, స్వర్ణ ప్యాలెస్ యాజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఏసీపీ సూర్యచంద్రరావు ప్రకటించారు.

ఆస్పత్రికి వచ్చిన వారికి సిటీ స్కాన్ చేసి, కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి వారి నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా బాధితులను కరోనా పేరిట భయభ్రాంతులకు కూడా గురిచేశారని వివరించారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, వారి కుటుంబసభ్యులపై కూడా నిఘా పెట్టినట్లు ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. ఇదిలాఉండగా, విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది కరోనా రోగులు మరణించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed