జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు

by  |
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాంత్రిక పూజల నెపంతో కన్న కూతుర్లను బలిగొన్న తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తంను ఘటన జరిగిన 32 గంటల తర్వాత అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

ఇదిలాఉండగా, పద్మజను అరెస్టు చేసే క్రమంలో మతిస్థిమితం కోల్పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని అధికారులు చెబుతున్నారు. కన్న కూతుర్లు చనిపోయారనే పశ్చాత్తాపం ముఖంలో ఏ మాత్రం కనిపించకపోగా నవ్వుతూ ఉందని పోలీసులు వివరించారు.


Next Story

Most Viewed