- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : వడ్డీలేని రుణాలు ఇప్పిస్తానని చెప్పి భారీ ఎత్తున బంగారంతో ఉడాయించిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే.. తమిళనాడు రాజధాని చెన్నైలో రూబీ ఫైనాన్స్ పేరిట ఇఫ్సర్ రెహ్మాన్ వడ్డీలేని రుణాలు ఇప్పిస్తానని కస్టమర్లకు మాయమాటలు చెప్పాడు. సుమారు 1500 మంది నుంచి 1000కేజీలకు పైగా బంగారు అభరణాలను సేకరించాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ మొత్తంతో ఉడాయించాడు.
దీంతో మోసపోయామని భావించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎట్టకేలకు హైదరాబాద్ మహానగరం BHELలోని ఓ ఇంట్లో నిందితుడు ఇఫ్సర్ రెహ్మాన్, అతని సోదరుడు అనీస్, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. అనంతరం వీరిని రిమాండ్ కు తరలించగా.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.