చెట్టుని ఢీకొని ఇద్దరు యువకులు మృతి…

by  |
చెట్టుని ఢీకొని ఇద్దరు యువకులు మృతి…
X

దిశ, భీమ్‌గల్: చెట్టుని ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.‌ వివరాల ప్రకారం భీమ్‌గల్ మండలం‌‌ పిప్రి గ్రామానికి చెందిన మనోజ్, భరత్, బాచెన్ పల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ ముగ్గురు యువకులు కలిసి మంగళవారం తెల్లవారుజామున సమయం గం. 12:30లకు భీమ్‌గల్ నుంచి ఆర్మూర్ కి ఏపీ 28 సీసీ3559 కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో వెల్పూర్ మండలం మోతే గ్రామం చివరికి చేరుకోగానే తాటి చెట్టుకి ఢీకొని మనోజ్ (22), శ్రవణ్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పక్కన కూర్చున్న భరత్ కి తీవ్ర గాయాలు అవ్వడంతో వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించగా, మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ రెడ్డి తెలిపారు.


Next Story