అదుపు తప్పింది.. ప్రాణం పోయింది

by  |
అదుపు తప్పింది.. ప్రాణం పోయింది
X

దిశ, మహబూబ్ నగర్: బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి నుంచి బైక్ పై సుబాన్, శివ, కృష్ణ అనే ముగ్గురు యువకులు వాళ్ల సొంత గ్రామమైన కర్నూలు జిల్లా గోవర్ధనగిరి మండలం వెల్దుర్తికి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల స్టేజ్ సమీపంలో 44 జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో సుబాన్ (22) అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు శివ, కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పలువురు వారిని 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.



Next Story