కాప్రా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అధికారిని

by  |
కాప్రా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అధికారిని
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిని చిక్కింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో వెలుగుచూసింది. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మీ రూ. 20 వేలు ఇస్తేనే పని అవుద్ది అంటూ ఓ స్వీపర్ వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో సదరు బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటుంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులపై అనుమానం వచ్చిన అధికారులు మల్లాపూర్‌లోని మహాలక్ష్మీ నివాసంలో సోదాలు చేస్తున్నారు.


Next Story

Most Viewed