- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చీపురుపల్లి నియోజకవర్గం గొల్లలములగం పంచాయతీ పరిధిలో వీఆర్వోగా పనిచేస్తున్న ధనాన్న వెంకట రమణ రైతు గడి దుర్గాప్రసాద్ దగ్గర భూమి మ్యుటేషన్ చేసేందుకు రూ.4వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై దుర్గాప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం రైతు దుర్గాప్రసాద్ దగ్గర నుంచి రూ.4,000 లంచం తీసుకుంటుంగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ.. శుక్రవారం గొల్లలములగం గ్రామానికి చెందిన రైతు తమకు వీఆర్వోపై ఫిర్యాదు చేయగా.. ఈరోజు దాడి చేసి రెడ్హ్యాడెండ్గా పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఏ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తమను సంప్రదించాలని డీఎస్పీ రఘువీర్ స్పష్టం చేశారు.