రూ.1500 డిమాండ్.. ఏసీబీ వలలో వీఆర్ఓ

by  |
రూ.1500 డిమాండ్.. ఏసీబీ వలలో వీఆర్ఓ
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రేష‌న్ కార్డు మంజూరుకు రూ.1500 డిమాండ్ చేసిన ఇద్ద‌రు రెవెన్యూ కార్యాల‌య సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న గురువారం ఖ‌మ్మం జిల్లా వైరా త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో జ‌రిగింది. మండ‌లానికి చెందిన ఓ నిరుపేద వ్యక్తి రేష‌న్ కార్డు మంజూరు చేయాల‌ని కోరుతూ త‌హ‌సీల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఇందుకు రూ.1500 ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డంతో గ్రామ‌స్థుల స‌హ‌కారంతో ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్ని గురువారం బాధితుడి నుంచి డ‌బ్బులు తీసుకుంటుండ‌గా కంప్యూటర్ ఆపరేటర్ సతీష్, గొల్లపూడి వీఆర్ఓ కశ్యప్‌ను ప‌ట్టుకున్నారు. ఇద్ద‌రిపై కేసులు న‌మోదు చేసి త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed