ఆదాయానికి మించి ఆస్తులు.. డీఎస్పీ అరెస్ట్

by  |
ఆదాయానికి మించి ఆస్తులు.. డీఎస్పీ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా యువకులు అరెస్ట్ కావడం చూస్తుంటాం.. కానీ కాస్త వెరైటీగా కామారెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో డీఎఎస్పీ లక్ష్మీ నారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విషయం ఏంటంటే.. రెండ్రోజుల పాటు మూడు జిల్లాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ సోదాలలో లక్ష్మీనారాయణ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న డీఎస్పీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బయటపడ్డ లక్ష్మీనారాయణపై ఆరా తీస్తే.. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

Next Story