సిరిసిల్లలో కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత.. పోలీసుల లాఠీచార్జ్

by  |
సిరిసిల్లలో కేటీఆర్ కాన్వాయ్ అడ్డగింత.. పోలీసుల లాఠీచార్జ్
X

దిశ, మానకొండూరు : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కాన్వయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్ తో ఏబీవీపీ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డగించారు. ఆందోళన చేసిన వారి పై పోలీసుల లాఠీ చార్జీ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆందోళన కారులను పోలీసులు కేటీఆర్ పర్యటించే ప్రదేశం నుంచి దూరంగా తరలించినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed