లిస్బన్ పబ్‌లో అశ్లీల నృత్యాలు

by  |
లిస్బన్ పబ్‌లో అశ్లీల నృత్యాలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : పంజాగుట్ట కంట్రీ క్లబ్‌లోని లిస్బన్ పబ్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీ, యువకులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పబ్‌ను అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నిర్వహించడం, ఆపై పబ్‌లో యువకులను రెచ్చగొట్టేలా డ్యాన్స్‌లు చేస్తుండటంతో పాటు అసాంఘీక కార్యాకలాపాలు పాల్పడుతున్నట్టుగా పంజాగుట్ట పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు లిస్భన్ పబ్ పై దాడి చేయగా, అశ్లీల నృత్యాలు చేస్తున్న 7 గురు యువతులతో సహా మొత్తం 28 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం యువతులను హోంనకు తరలించగా, అరెస్టైన వారికి నోటీసులు అందజేశారు. అయితే పబ్ నిర్వాహకులు మేనేజర్ వేణుగోపాల్, గేట్ ఎంట్రీ ఇంచార్జ్ నందీశ్వర్, బంటీ, మురళిలు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే పబ్‌పై ఇప్పటికే నాలుగు సార్లు దాడులు చేసి పలు కేసులు నమోదు చేసి హెచ్చరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, లిస్బన్ పబ్‌ను సీజ్ చేయాలంటూ పంజాగుట్ట పోలీసులు ఆర్డీవోకు, ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ రాసినట్టుగా ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed