- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరాల్లో 40శాతం మహిళలే బాధితులు
<p>దిశ, క్రైమ్బ్యూరో: కొవిడ్-19 నేపథ్యంలో నమోదైన నేరాల్లో 70శాతం సైబర్ నేరాలే ఉన్నాయని, అందులో 40శాతం ఇంటర్నెట్ వినియోగించే మహిళలు, పిల్లలే బాధితులుగా ఉన్నారని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి అన్నారు. పోలీస్శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల సైబ్-హర్ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ – సైబర్ సేఫ్టీ అనే అంశంపై సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఐజీ సుమతి మాట్లాడతూ ఇంటర్నెట్ ఉపయోగించే పిల్లలు 40శాతం మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని […]</p>

X
దిశ, క్రైమ్బ్యూరో: కొవిడ్-19 నేపథ్యంలో నమోదైన నేరాల్లో 70శాతం సైబర్ నేరాలే ఉన్నాయని, అందులో 40శాతం ఇంటర్నెట్ వినియోగించే మహిళలు, పిల్లలే బాధితులుగా ఉన్నారని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి అన్నారు. పోలీస్శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల సైబ్-హర్ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ – సైబర్ సేఫ్టీ అనే అంశంపై సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఐజీ సుమతి మాట్లాడతూ ఇంటర్నెట్ ఉపయోగించే పిల్లలు 40శాతం మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలు, యువతలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. పోర్నో సైట్స్ చూడడంతో పాటు అత్యధిక సమయం మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం ద్వారా తల్లిదండ్రులపై విసుగు ప్రదర్శించడం, అమర్యాదగా ప్రవర్తించే పిల్లల సంఖ్య ఎక్కువైందన్నారు.
Next Story






