గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. వారితో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్

by  |
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. వారితో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ, రాజకీయ సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఇక తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అమీర్ ఖాన్ తో ఎంపీ స్వయంగా మొక్క నాటించారు. సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ కి చేరుకున్న అమీర్ ఖాన్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటినందుకు నటులకు కృతజ్ఞతలు తెలిపిన సంతోష్ అమీర్ ఖాన్ కు ‘వృక్షవేద’ పుస్తకాన్ని బహుకరించారు. ఇక ఈ విషయాలను ఆయన తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

https://twitter.com/MPsantoshtrs/status/1439513001560731651?s=20


Next Story