బాయ్‌ఫ్రెండ్‌ను వదిలించుకుందాం అనుకున్నా.. కుదర్లే

by  |
బాయ్‌ఫ్రెండ్‌ను వదిలించుకుందాం అనుకున్నా.. కుదర్లే
X

దిశ, సినిమా : ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్.. బాయ్‌ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఏడాది నుంచి అతనితోనే కలిసిఉంటున్న అలియా, మొదట తనను డేటింగ్ యాప్‌లో మీట్ అయినట్లు చెప్పింది. ఇనీషియల్ డేస్‌లోనే షేన్‌ను వదిలించుకుందామని అనుకున్నానని.. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఖుషీ కపూర్, ముస్కాన్ తన మైండ్‌సెట్ మార్చారని తెలిపింది. గత నెల తమ రిలేషన్‌‌షిప్‌ యానివర్సరీ సందర్భంగా అలియా తన యూట్యూబ్‌ చానల్లో వీడియో పోస్టులో.. బ్రేకప్ తర్వాత షేన్‌ను కలిసినట్టు చెప్పుకొచ్చింది. ‘చాలా కాలం వరకు ఎలాంటి రిలేషన్‌షిప్‌ పెట్టుకోవద్దని అనుకున్నా. కానీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన నెలరోజుల తర్వాత జస్ట్ ఫన్ కోసం డేటింగ్ యాప్‌లో జాయిన్ అయ్యా. ఇతర అబ్బాయిలతో మాట్లాడటం వల్ల బాధను మరచిపోవచ్చనేది నా ఉద్దేశ్యం. అయితే ఫోన్ నెంబర్ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు’ అని వివరించింది.

షేన్‌తో ప్రొఫైల్ మ్యాచ్ అయ్యాక అతను వీడియో కాల్‌ చేయమంటే ఒప్పుకున్నానని.. కానీ వర్చువల్ డేట్స్ వంటివి నచ్చక తనను వదిలేస్తానని బెస్ట్ ఫ్రెండ్స్ ఖుషీ కపూర్, ముస్కాన్‌కు మెసేజ్ చేసినట్టు తెలిపింది. అయితే వాళ్లు కన్విన్స్ చేయడంతో కాల్ చేశానని, మొదటిసారే నాలుగు గంటల పాటు మాట్లాడుకున్నామని చెప్పింది.



Next Story

Most Viewed