అలంపూర్‌ ఆలయాల మూసివేత

by  |
అలంపూర్‌ ఆలయాల మూసివేత
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను ఈనెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయాల కార్యనిర్వహణాధికారి ప్రేమ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలంపూర్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్‌-19 వ్యాప్తి చెందే ప్రమాదముందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు రాకుండా విరమించుకోవాలని ఈవో కోరారు.



Next Story

Most Viewed