స్మార్ట్ ఫోన్ కొనివ్వ లేదని.. ఆత్మహత్య..

by Batti.Sumithra |   (  Updated:2021-07-27 08:24:59  IST  )

<p>దిశ, మహబూబాబాద్ : స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎద్దులపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్తగూడ ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం .. ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస త్రిష (16) ఇటీవల పదవ తరగతి పాస్ అయింది. ఆన్‌లైన్‌లో క్లాసులు ఉన్నాయని మొబైల్ కొనివ్వమని తండ్రి సతీష్ ను కోరడంతో తండ్రి డబ్బులు లేవని, కొద్ది [&hellip;]</p>

స్మార్ట్ ఫోన్ కొనివ్వ లేదని.. ఆత్మహత్య..
X

దిశ, మహబూబాబాద్ : స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎద్దులపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్తగూడ ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం .. ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస త్రిష (16) ఇటీవల పదవ తరగతి పాస్ అయింది.

ఆన్‌లైన్‌లో క్లాసులు ఉన్నాయని మొబైల్ కొనివ్వమని తండ్రి సతీష్ ను కోరడంతో తండ్రి డబ్బులు లేవని, కొద్ది రోజులు ఆగు అని చెప్పడంతో మనస్తాపం చెంది క్షణిక ఆవేశంలో పురుగుల మందు సేవించింది. గమనించిన తల్లిదండ్రులు నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్ళిగా చికిత్స పొందుతుండగా మృతి చెందింది. ఈ విషయమై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story