పెళ్లంది.. ఎయిర్ పోర్ట్ దగ్గరే ఉన్నానంది.. కానీ అంతలోనే

by  |
పెళ్లంది.. ఎయిర్ పోర్ట్ దగ్గరే ఉన్నానంది.. కానీ అంతలోనే
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహ పరిచయ వేదికలు.. అదేనండి మాట్రిమోనీలు.. వీటి వలన చాలామంది పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒకరినొకరు అర్ధం చేసుకొని ఒక్కటవ్వుతున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు వీటిని కూడా వదలడం లేదు. ఆన్ లైన్ మోసాల గురించి, ఫేస్ బుక్ పరిచయాల గురుంచి పోలీసులు అవగాహన చేస్తున్నా ప్రజలు ఎక్కోడో ఒక చోట మోసపోతూనేఉన్నారు. తాజాగా ఒక యువతి పెళ్లిపేరుతో ఓ యువకుడిని బురిడీ కొట్టించిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. సులేమాన్ నగర్ కి చెందిన ఒక యువకుడికి మ్యాట్రీమోని లో దుబాయ్ కి చెందిన ఓ అమ్మాయి పరిచయమయ్యింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

కొన్నిరోజుల తర్వాత యువతి దుబాయ్ నుండి ఇండియాకు వస్తున్నానని, ఎయిర్ పోర్ట్ లో తన లగేజ్ కి డబ్బులు కట్టమంటున్నారని యువకుడికి తెలిపింది. తన దగ్గర అన్ని యూరోలే ఉన్నాయని, తనకు వెంటనే రూ.48 వేలు పంపాల్సిందిగా కోరింది. సరేనని యువకుడు తన సోదరుడిని అడిగి ఆమె అడిగిన మొత్తని ఆమె అకౌంట్ లో జమచేశాడు. ఆ తర్వాత నుండి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో యువకుడు మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే సోదరుడు యూసఫ్ తో కలిసి యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed