రాజన్న …. జర ఇటు చూడు

by  |
రాజన్న …. జర ఇటు చూడు
X

దిశ, వేములవాడ: మున్సిపల్ సిబ్బంది చేసిన పొరపాటు వాహనదారుల కు ఇబ్బందులు కలిగిస్తున్నది. వేములవాడ పట్టణంలో రాజన్న క్షేత్రం సమీపంలో మురికి కాల్వల శుభ్రం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ ఓపెన్ చేయడంతో వాహదారులు అందులో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూటర్ మీద వెళ్తున్న ఓ యువకుడు స్కూటర్ తో సహా మురికి కాలువలో పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడి తో పాటు స్కూటర్ ను బయటకు తీశారు. మరమ్మతులు చేసే ప్రదేశంలో ఎలాంటి హెచ్చరికల సూచిక బోర్డు లు పెట్టక పోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలిగేలా ‘ రాజన్న కొద్దిగా ఇటు చూడన్నా’ అని పట్టణ వాసులు దేవున్ని వేడుకుంటున్నారు.

Next Story