నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

by  |
road accident
X

దిశ‌, ఖ‌మ్మం టౌన్ : బస్సును ఢీ కొన్న ద్విచక్రవాహనం ,వాహనదారుడు అక్కడికక్కడే మృతి. వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం పై సెల్ ఫోన్లో మాట్లడుతూ నిర్లక్ష్యంగా బండి నడపడంతో ఎదురుగా వచ్చే ఆర్టీసీ బస్సును చూడకుండా ఢీ కొట్టాడు ఈ ఘటన మంగళ వారం కొణిజర్ల మండలం, గోపవరం గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని ఎంత చెప్తున్నావినడం లేదని అందువల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలానే అతని నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసిందని అక్కడి స్థానికులు అంటున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సీ ఉంది.

Next Story

Most Viewed