ట్రాక్టర్ ఢీ.. ఎగిరిపడి యువకుడు మృతి

by  |
ట్రాక్టర్ ఢీ.. ఎగిరిపడి యువకుడు మృతి
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామం వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో బండ్ల సంతోష్(27) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన బండ్ల సంతోష్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) బంధువుల ఇంటికి వెళుతున్నాడు.

ఇంతలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఎగిరిపడి వ్యవసాయ గొర్రుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదకరంగా ట్రాక్టర్‌పై వ్యవసాయ గొర్రు తగిలించుకుని అతివేగంగా ట్రాక్టర్ నడపడమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

Next Story

Most Viewed