అడ్డుకున్నందుకు యువకుడు దారుణ హత్య

by  |
అడ్డుకున్నందుకు యువకుడు దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుచేసుకుంది. ఓ యువకుడ్ని కత్తితో పొడిచి, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని విహార్ ప్రాంతంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. టైగ్రి ఎక్స్‌టెన్షన్ కాలనీలో వివేక్(19) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఈ క్రమంలో అతన్ని కలిసేందుకు రోజూ కొందరు స్నేహితులు కాలనీలోకి వస్తుండేవారు. అయితే కాలనీకి చెందిన సతీశ్ అనే వ్యక్తి దీనిపై అభ్యంతరం చెప్పాడు. బయట వ్యక్తులను కాలనీలోకి రానివ్వొద్దని చెప్పడంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది.

దీంతో సతీశ్‌కు గుణపాఠం చెప్పాలని వివేక్‌, పియూష్‌ నిర్ణయించారు. మంగళవారం రాత్రి కాలనీ బయట సతీశ్‌ ఉండటాన్ని గమనించిన వివేక్, పియూష్ సతీశ్‌తో ఘర్షణకు దిగారు. సతీశ్‌ను కత్తితో పొడిచారు. గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. అయితే ఈ సతీశ్‌పై కత్తితో దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు ఆ కాలనీకి చెందిన వివేక్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి స్నేహితుడు పియూష్‌ కోసం గాలిస్తున్నారు.


Next Story

Most Viewed