పుట్టినరోజు నాడే శవమైన యువకుడు

by  |
పుట్టినరోజు నాడే శవమైన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : పుట్టినరోజు నాడే యువకుడు మృతి చెందిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులో రైలు పట్టాలపై ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. గమనించిన స్థానికులు యువకుడిని గ్రామానికి చెందిన సందీప్ గా గుర్తించారు. సందీప్ శవం ఉన్న రైల్వే పట్టాలకు కాస్త దూరంలో మద్యం బాటిళ్లు ఉండడంతోపాటు శరీరంపై పెద్దగా గాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed