చెల్లిపై అత్యాచారం.. వీడియోలు తీసి.. రహస్యంగా అక్కతో

by  |
gang rape news
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రేమ పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలను తల్లిదండ్రులకు చూపించి లక్షలు వసూళ్లు చేశాడు. అనంతరం అక్కను మభ్యపెట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరిపేటకు చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం చేబ్రోలులో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది.

అదే గ్రామానికి చెందిన వేములపల్లి జోష్‌బాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట పెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు ఆమెతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలను ఆమె కుటుంబ సభ్యులకు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి రూ.3.30 లక్షలు వసూళ్లు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక అక్కను మభ్యపెట్టి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. మభ్యపెట్టి పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు. ఇకపోతే నిందితుడు జోష్‌బాబు పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.


Next Story

Most Viewed