కరోనా బాధితులకు ‘ఫ్రీ’ మీల్స్.. శభాష్ అనిపించుకున్న యువకుడు

by  |
కరోనా బాధితులకు ‘ఫ్రీ’ మీల్స్.. శభాష్ అనిపించుకున్న యువకుడు
X

దిశ, చేవెళ్ళ : కరోనా బాధితులకు అండగా ఉంటూ నిత్యం 30 మంది రోగులకు అమ్మలా భోజనం సరఫరా చేస్తూ ఓ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన కుమార్ గౌడ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో నాలుగు రోజలుగా కరోనా రోగుల కడుపు నింపుతున్నాడు. ఒక రోజు ముందు 9952652140 నెంబర్‌కు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తే భోజనం సమయానికి పార్శిల్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాడు. కరోనా పాజిటివ్ వస్తేనే సొంత కుటుంబ సభ్యులే దగ్గరకు వెళ్ళడానికి ముందు.. వెనుక ఆలోచిస్తున్న సమయంలో ఈ యువకుడు రోగులకు స్వయంగా భోజనం ప్యాకెట్ అందించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.


Next Story

Most Viewed