హాస్పిటల్‌లో బాలిక మృతదేహం వదిలి యువకుడు పరారీ

by  |
హాస్పిటల్‌లో బాలిక మృతదేహం వదిలి యువకుడు పరారీ
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రాథమిక ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని వదిలి యువకుడు పరారైన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాయికృష్ణ అనే యువకుడు బాలిక మృతదేహాన్ని వదిలి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మృతురాలు స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిగా గుర్తించారు. మృతదేహం వదిలి వెళ్లిన యువకుడు కూడా అదే మండలానికి చెందినవాడు. కాగా, బాలిక మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.

tag: young man, leaving, dead body, hospital, wanaparthy

Next Story