ఇంట్లో మందలించారని యువకుడి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-25 17:15:54  IST  )

దిశ, చేగుంట : ఇంట్లో మందలించారని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి

ఇంట్లో మందలించారని యువకుడి ఆత్మహత్య
X

దిశ, చేగుంట : ఇంట్లో మందలించారని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన జశ్వంత్ (18) ఇంట్లో తల్లితో గొడవ పడి మనస్థాపానికి గురైన యశ్వంత్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసుల సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story