‘ఆమె ఏడాది పాటు బాత్రూంలోనే ఉంది’

by  |
‘ఆమె ఏడాది పాటు బాత్రూంలోనే ఉంది’
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త భార్యను దారుణంగా హింసించి, ఏడాది పాటు బాత్రూంలో బంధించాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా రిష్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మహిళా, శిశు సంక్షేమ సంస్థకు చెందిన కొందరు మహిళలు పోలీసుల సహాయంతో ఘటనా స్థలికి చేరుకొని, మహిళను బయటకు తీశారు. చాలా కాలంగా బాత్ రూమ్‌లో ఉండటంతో అనారోగ్యానికి గురైంది.

దీంతో ఆమెను రక్షణ కేంద్రానికి తరలించారు. కాగా దీనిపై భర్తను నిలదీయగా… గత కొంతమాలంగా తన భార్య మానసికంగా ఇబ్బందులు పడుతోందని, వైద్యం చేయించినా నయం కాలేదని, ఇంట్లో ఉండమని చెప్పినా వినకుండా బాత్రూంలోనే ఉంటుందని.. బాధితురాలి భర్త వెల్లడించారు.

Next Story

Most Viewed