- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది.
విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, మల్లయ్య కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మల్లయ్య సంబంధీకులు రాళ్లతో దాడి చేయడంతో లత తీవ్రంగా గాయపడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
Next Story