వరంగల్ లో దారుణం.. రాళ్లతో ఓ మహిళను కొట్టి చంపారు

by  |

దిశ, వరంగల్: ప్రపంచం ఆధునికంగా అభివృద్ధిలో దూసుకుపోతోన్నది. కానీ, కొంతమంది మాత్రం మానవీయతను కోల్పోయి పైసలు, ఆస్తులే పరమావధిగా భావిస్తూ ఎదుటి వ్యక్తుల ప్రాణాలను బలిగొంటున్నారు. భూమి కౌలు వివాదం ఓ మహిళను బలిగొంది.

విషయమేమిటంటే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో పోసారపు రాజయ్యకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన మల్లయ్య కౌలు చేస్తున్నాడు. ఇటీవల అదే భూమిని రాజయ్య తన కూతురు లత(36) అప్పగించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా రాజయ్య, మల్లయ్య కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మల్లయ్య సంబంధీకులు రాళ్లతో దాడి చేయడంతో లత తీవ్రంగా గాయపడింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.



Next Story

Most Viewed