భర్తతో గొడవ పడి చిన్నారితో పాటు మహిళ ఆత్మహత్య

by  |
భర్తతో గొడవ పడి చిన్నారితో పాటు మహిళ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: భర్తతో గొడవ పడి చిన్నారితో పాటు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ శ్రీరామ్‌నగర్ బస్తీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బీహర్‌ రాష్ట్రానికి చెందిన విమల్ కుమార్, ఆర్తి దంపతులు. విమల్ కుమార్ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో పది నెలల కుమార్తెను తీసుకుని భవనంపై నుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన తల్లికుమార్తెలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆర్తి మృతి చెందింది. ప్రస్తుతం పది నెలల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed