పెళ్లి పేరుతో టోపీ.. కటకటాల పాలైన కి‘లేడీ’

by  |
పెళ్లి పేరుతో టోపీ.. కటకటాల పాలైన కి‘లేడీ’
X

దిశ,హైదరాబాద్‌: పెళ్లి పేరుతో వ్యాపారికి ఓ మహిళ టోపీ పెట్టింది. వ్యాపారి నుంచి రూ.11 కోట్లను కిలాడీ లేడీ కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. పెళ్లి చేసుకుంటానని వీరారెడ్డి అనే వ్యాపారిని నమ్మించింది.

అతని దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.11 కోట్లను తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలియడంతో వీరారెడ్డి పోలీసులను అశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.6కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed