హుజూరాబాద్ బైపోల్.. కాంగ్రెస్​లో బుజ్జగింపుల పర్వం

by  |
huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో అసంతృప్తి నేతలను బుజ్జగించారు. హుజురాబాద్ కాంగ్రెస్ అసంతృప్త నేతలతో పార్టీ ముఖ్యుల సమాలోచనలు జరిపారు. అసంతృప్తి నేతలతో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్ కుమార్ చర్చలు జరిపారు. హుజురాబాద్‌ టికెట్ కోసం మొత్తం 19 మంది దరఖాస్తు చేసుకోగా.. వారెవరికీ కాకుండా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. టికెట్ ఆశించిన పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. టికెట్ ఆశించిన వారందరినీ గాంధీ భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. అనంతరం అసంతృప్తి నేతలతో కలిసి దామోదర రాజనర్సింహా మాట్లాడారు. అంతా కలిసి వెంకట్​ విజయానికి కృషి చేస్తారన్నారు.

Next Story

Most Viewed