పబ్జీకి మరో విద్యార్థి బలి

by  |
పబ్జీకి మరో విద్యార్థి బలి
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్‌కు మరో విద్యార్థి ప్రాణం బలైపోయింది. ఈ ఘటన తిరుపతిలోని బీఆర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఇంటర్ చదువుతున్న తేజస్ అనే విద్యార్థి పబ్జీకి తీవ్రంగా బానిస అయ్యాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం గేమ్‌లో గన్ కొనేందుకు రూ.3లక్షలు ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. ఎంతకీ తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. విషయం తెలిసిన తల్లిదండ్రుల రోదన స్థానికులందరినీ కంటనీరు తెప్పించింది. అయితే ఇండియాలో ఈ గేమ్ బ్యాన్ అయినా విద్యార్థులు ఇంకా గేమ్ ఆడుతుండటం గమనార్హం.


Next Story

Most Viewed