- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,చౌటుప్పల్: బుధవారం తమిళనాడు లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో అటు మరో 13 మంది అమర జవాన్లకు చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బిపిన్ రావత్ చిత్రపటానికి జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి పూలమాలవేసి అమరులకు నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా పాటుపడిన త్రివిధ దళాధిపతి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ రక్షణ వ్యవస్థలో సాంకేతికతను తీసుకురావడంలో రావత్ పాత్ర కీలకమని ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోగుదాల రమేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి,తిరుపతి రవీందర్, కొయ్యడ సైదులు గౌడ్, చింతల సాయిలు, జానీ బాబు,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.