- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: అక్కడ తెల్లతెల్లవారుతున్నది.. సంతోషంగా వారు ముందుకెళ్తున్నారు. కానీ, ఈ సమయంలో అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది. దీంతో అప్పటి వరకు తమతో కలిసి ఉన్న ఆ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వాళ్లంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం తెల్లవారు జామున జిల్లాలో ఓ డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి ప్రాంతంలోని అర్భన్ పార్క్ వద్ద రెండు ఆటోలను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులు శ్రీహరి(35), బోహిని నర్సింహులు(44)గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.