ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 

by  |
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 
X

దిశ, సూర్యాపేట: చివ్వేంల మండలం పరిధిలోని దురాజ్ పల్లిలో గల మామిడి తోటలో గురువారం సూర్యాపేటకు చెందిన నిర్మలా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు 2008-2012 పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. 9 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో అందరూ సంతోషంగా ఆప్యాయంగా పలకరించుకున్నారు. కళాశాల లో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంతే కాకుండా ఉద్యోగాల్లో సెటిల్ అయిన వారు ఉద్యోగానికి పడిన శ్రమను స్నేహితులతో పంచుకున్నారు.

జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా అధిగమించి ప్రతి ఒక్కరు మంచి స్థాయిలో స్థిరపడాలన్నారు. అనంతరం మిత్రులందరు కలిసి సరదాగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్లేటి మనీషా, సౌజన్య, కృష్ణవేణి, సంధ్య, మల్లీశ్వరి, విజయ, కీర్తి, సుహాసిని, జానకి, మంజుల,మేనక, కుమారి, రాణి, శోభ, మహబూబ,సంధ్య, లోలిత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed