రైతుకు దొరికిన గుప్తనిధుల కుండ?

by  |
రైతుకు దొరికిన గుప్తనిధుల కుండ?
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లాలో గుప్త నిధి కలకలం సృష్టించింది. భూమి చదును చేస్తున్న ఓ రైతుకు నిధి దొరికిందన్న వార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ లోని రంగనాయకుల గుట్ట వద్ద భూమి చదును చేస్తున్న రైతు రాజిరెడ్డికి పురాతన కుండ లభించింది. దానిలో పురాతన బంగారు నాణేలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్త జిల్లాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు పరుగులు పెట్టారు. స్థానిక పోలీసులతోపాటు రెవెన్యూ, పురావాస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి రైతు ఇంటిని, గుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. రైతును అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed