వారి సమస్యలు.. వెంటనే పరిష్కరించాలి

by  |
వారి సమస్యలు.. వెంటనే పరిష్కరించాలి
X

దిశ, చేర్యాల: రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓ శ్రీనివాస్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భూమయ్య, అశోక్ మాట్లాడుతూ… కరోనాతో కష్టాల పాలైన వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తులు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని 6 నెలల పాటు ఇవ్వాలనీ, ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు చేయాలని కోరారు.

Next Story