చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి..

by  |
accident
X

దిశ, ఖమ్మం రూరల్​ : చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన రూరల్​ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్​ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నూతలపాటి నవీన్​(30) సొమవారం టూవీలర్​ పై ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రూరల్​ మండలంలో మద్దులపల్లి గ్రామశివారున గల బంక్​ సమీపంలో బైక్​ అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టాడు. ఈఘటనలో నవీన్​ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వహస్పిటల్​కు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ శంకర్​రావు తెలిపారు.

Next Story

Most Viewed