దామగుండం కాల్పుల ఘటనలో కొత్తకోణం

by  |
దామగుండం కాల్పుల ఘటనలో కొత్తకోణం
X

దిశ, వెబ్‎డెస్క్ : వికారాబాద్‌ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణి, ఆమె బంధువులకు ఫాంహౌస్‌లు ఉన్నట్లు తేలింది. ఫాంహౌస్‎లకు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులను కూడా ఫాంహౌస్‌ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఫాంహౌస్ పరిసరాల్లోకి పశువులు తీసుకురావొద్దంటూ గ్రామస్తులను నిర్వాహకులు, యజమానులు హెచ్చిరస్తున్నారని తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. ఫాంహౌస్‎కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed