అత్యాచార నిందితుడికి.. పదేళ్లు జైలు శిక్ష

by  |
అత్యాచార నిందితుడికి.. పదేళ్లు జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లికి చెందిన ప్రముఖ వాస్తు నిపుణుడు, సివిల్ కాట్రాక్టర్ గట్టు రాజేందర్ 2012లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు రాజేందర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

అలాగే లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా నాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.



Next Story

Most Viewed