ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకున్న తల్లి..

by  |
ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకున్న తల్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుబ్బులు(27), కుమార్తె మధురవాణి(5)లు అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మహేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రాంభించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed