చుక్కేసి.. కొడుకును బ్లేడ్‌తో చెక్కేసింది!

by  |
చుక్కేసి.. కొడుకును బ్లేడ్‌తో చెక్కేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్ : బిడ్డలను లాలించి, ప్రేమించడమే అమ్మలకు తెలుసు. కానీ ఓ తల్లి మద్యం మత్తులో కసాయిగా మారి కన్నకొడుకునే పీల్చి చెండాడింది. ఏం చేస్తుందో కూడా స్పృహ లేకుండా తాగిన ఆమె.. కుమారుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ మండలం గంధంగూడలో తాగిన మైకంలో ఓ తల్లి కుమారుడిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయపర్చింది. గాయాల బాధను బరించలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను అడ్డుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా తల్లి మద్యం మత్తులో ఉండే ఈ ఘాతుకానికి పాల్పడ్డినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

Next Story

Most Viewed