- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రపంచం రోజుకో కొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్నా కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. దొంగ బాబాలను నమ్ముతూ వారి ఇల్లు గుల్ల చేసుకొంటున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను, ప్రేమించినవారి ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. తాజాగా ఒక తల్లి మూఢనమ్మకంతో చేసిన ఒక పనికి ఏడు నెలల పసివాడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోన్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. భిల్వారా నగరంలో నివసించే దంపతులకు ఏడు నెలల కొడుకు ఉన్నాడు. బాబుకు గతకొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. చుట్టుపక్కల వారు చెప్పిన మాటలు విన్న తల్లి బాబును ఒక బాబా వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించింది. దీంతో బాబా కొన్ని తాయత్తులు కట్టి పంపించాడు. కానీ దానివల్ల ఉపయోగం లేకపోవడంతో మరోసారి బాబును, బాబా వద్దకు తీసుకెళ్లింది తల్లి. బాబు ఆరోగ్యం బాగా ముదిరిందని, అది తగ్గాలంటే బాబు ఛాతీపై ఎర్రగా కాల్చిన రాడ్డుతో వాత పెట్టాలని తెలిపాడు. దీంతో తల్లి కంగారుపడింది. బిడ్డకు అనారోగ్యం తగ్గాలని, భయపడవద్దని చుట్టూ ఉన్నవారు చెప్పడంతో తల్లి ఆ పనికి అంగీకరించింది. దాంతో బాబా ఆ పసివాడి ఛాతీపై వేడి వేడి రాడ్డుతో వాత పెట్టాడు. సాయంత్రానికి బాబు పరిస్థితి విషమించడంతో ఆ తల్లిదండ్రలు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఏమైందని వైద్యులు అడగగా జరిగిన విషయం తల్లి వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.