- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రేమ పేరుతో ఆరుగురు అమ్మాయిలను మోసం చేసి డబ్బులను దండుకున్నాడు ఓ వివాహితుడు. అమ్మాయిలను ఫేస్బుక్లో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి అని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవడానికి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. చందానగర్కు చెందిన విజయ్ భాస్కర్కు 2017లో సౌజన్యతో వివాహం అయింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. వివాహ అనంతరం మేనకోడలిపై విజయ్ భాస్కర్ కన్నేశాడు. మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేసుకుని అమ్మాయిలతో ఫేస్ఋక్లతో పరిచయం పెంచుకున్నాడు. ఆరుగురు అమ్మాయిలను వంచించి డబ్బులు వసూలు చేశాడు. భార్య ఉండగా మరో ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు విజయ్ భాస్కర్. ఈ నేపథ్యంలో భార్య సౌజన్యను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో తనకు న్యాయం చేయాలని సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి సమయంలో 25 తులాల బంగారం, రూ.15 లక్షలు కట్నం తీసుకున్నారని సౌజన్య తెలిపారు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ భాస్కర్ను అదుపులోకి తీసుకున్నారు.