మద్యానికి బానిసై.. వ్యక్తి ఆత్మహత్య

by  |

దిశ, మెదక్: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా దాదాపు 40రోజులు మద్యం దుకాణాలను ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. మద్యానికి అలవాటు పడిన వ్యక్తులు మందు దొరక్క వింతగా ప్రవర్తించిన తీరును మనం ఇప్పటికే చూశాం. ఇదే తరహాలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మల్లేశం(35)కు బాబిల్ గామ గ్రామానికి చెందిన సరితకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వచ్చి స్థానిక పరిశ్రమంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మల్లేశం మద్యానికి బానిసై పనిచేయడం మానేశాడు. ఇంటి ఖాళీగా ఉంటూ తీవ్ర మనోవేధన చెంది గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed