పరోటా తిన్నాడని ప్రాణం తీసేశాడు..

by  |
murder
X

చెన్నై : తాను తింటున్న ప్లేట్ నుంచి తన అనుమతి లేకుండా పరోటాను తిన్నాడనే కోపంతో ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

తమిళనాడులోని కోయంబత్తూరు‌కు చెందిన ఆర్. వెల్లింగిరి ఇటుక బట్టిలో కూలీగా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం (సోమవారం) రాత్రి తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా మందు తాగిన అతడు.. తగడం గ్రామం సమీపంలో ఉన్న హోటల్‌లో పరోటా తింటూ ఉండగా.. అక్కడికి వెల్లింగిరి పనిచేస్తున్న ఇటుక బట్టీలలో పనిచేసే మరో కార్మికుడు జయకుమార్ వచ్చాడు. అతడు చూడటం లేదని గమనించిన జయకుమార్.. వెల్లింగిరి ప్లేట్‌లో ఉన్న పరోటా ముక్కను తుంచి తిన్నాడు. ఇది చూసిన జయకుమార్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఇదే క్రమంలో మద్యం మత్తులో ఉన్న వెల్లింగిరి.. పక్కనే ఉన్న ఇటుక, కర్రలతో జయకుమార్‌పై దాడికి దిగాడు. కర్రతో తల మీద బలంగా బాదాడు. దీంతో బాధితుడు అక్కడే కూలబడిపోయాడు. తల నుంచి రక్తాలు కారుతుండం చూసిన తర్వాత అక్కడే చుట్టుపక్కల ఉన్న పలువురు జయకుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed