సుల్తానాబాద్‌లో దారుణ హత్య

by  |
సుల్తానాబాద్‌లో దారుణ హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధనావత్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి కత్తితో పొడిచి హత్య చేశారు. దుండిపాలెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సాయి ఈ హత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య జ్యోతి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed