మర్డర్, మానభంగం.. బాలిక కళ్లు పీకి రక్తంతో.. భార్య కోసమేనట!

by  |
bihar news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటూ కొత్త కొత్త ఆవిష్కరణలను ఆవిష్కరిస్తోంది. భూమి మీదనే కాకుండా గ్రహాల మీద కూడా ఎలా నివసించాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు, కానీ, కొంతమంది మాత్రం ఇంకా మూఢ నమ్మకాల పేరుతో మనుషులను బలి ఇస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి మైనర్ బాలికను బలి ఇస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో, ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమె కళ్లు పీకేసి, ఆమె రక్తంతో పూజ చేసిన వికృత ఆరాచక ఘటన బీహార్ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్‌కు కుమార్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఆయన భార్య నాలుగు సార్లు గర్భం దాల్చినా అది నిలవలేదు. ఏదో ఒక కారణంతో నాలుగుసార్లు అబార్షన్ అయ్యింది. ఎందుకు ఇలా జరుగుతుందో అని ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇక చివరగా స్నేహితుల సలహాతో దిలీప్, పర్వేజ్ ఆలమ్‌ అనే తాంత్రికుడిని కలిశాడు. “నీకు పిల్లలు పుట్టాలంటే పదేళ్ల బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజలు చేయాలని, అలా చేస్తే మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు”. ఇక ఆ తాంత్రికుడి మాటలు నమ్మిన దిలీప్ బాలికను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశాడు.

ఆగస్టు 4 న పొలంలో ఉన్న తండ్రికి భోజనం తీసుకెళ్తున్న ఓ పదేళ్ల బాలికను స్నేహితులతో కలిసి దిలీప్ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి అతికిరాతకంగా ఆమె కళ్లు పీకేసి, ఆమె రక్తాన్ని తీసుకొని మృతదేహాన్ని అక్కడ వదిలేసి పరారయ్యాడు. బాలిక కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులకు చిన్నారి మృతదేహం కనిపించింది. బాలిక శరీరంపై అక్కడక్కడా తీవ్రమైన గాయాలు ఉండడం, కళ్లు పీకేసి ఉండడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకొని విచారించగా దిలీప్ బాగోతం బయటపడింది. అతడి అరెస్ట్ చేసి తమ దైన స్టైల్లో విచారించగా నేరం అంగీకరించి జరిగిన విషయాన్ని చెప్పాడు. దిలీప్ ఇచ్చిన సమాచారంతో పర్వేజ్ ఆలమ్‌తో పాటు తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. మరోపక్క ఇది నరబలి కాదని, బాలికపై అత్యాచారం చేసి. హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed