కానిస్టేబుల్ పై యువకుడి దాడి 

by  |
కానిస్టేబుల్ పై యువకుడి దాడి 
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే… డయల్ 100 కి ఫోన్ చేసి తనను రోహిత్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ రాంబాబు ఘటనాస్థలానికి వెళ్లారు.

అక్కడి పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా… పోలీస్ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు రోహిత్. దీంతో రోహిత్ పై కానిస్టేబుల్, సదరు యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed