పాలకుర్తిలో కరోనా కలకలం.. వైరస్‌ సోకిన వ్యక్తి మృతి

by  |
Palakurti, corona died
X

దిశ, పాలకుర్తి: తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో రోజూ 30కిపైగా కేసులు అడ్మిట్ అవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కరోనా కలకలం రేపింది. కరోనా సోకి నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎల్లయ్య(57) మృతి చెందాడు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం స్థానికంగా చికిత్స పొందుతూ.. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిచారు. ఎంజీఎం‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో పాలకుర్తిలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు.

Next Story

Most Viewed